భద్రాచలం రామయ్య ఉప ఆలయాల్లో ఒకటైన శ్రీ యోగానంద లక్ష్మీనరసింహాస్వామి ఉపాలయంలో వార్షిక తిరుకల్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం నరసింహాస్వామి జయంతి సందర్భంగా పంచామృతాలతో అభిషేకం జరిపారు. తిరుకల్యాణ మహోత్సవ పూజలలో భాగంగా అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణ నిర్వహించారు. సాయంత్రం ఎదుర్కోలు ఉత్సవం ఆటపాటలతో జరిపారు.