భద్రాచలం నియోజకవర్గం వెంకటాపురం మండలంలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు 46 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి పథకం చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో అర్హులైన ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తోందని, లబ్ధిదారులు ఈ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.