భద్రాచల రామయ్య సన్నిధిలో జరుగుతున్న జీర్ణోద్ధరణ పనులను తెల్లం వెంకటరావు ఆదివారం పర్యవేక్షించారు. ఈవో దామోదర్ రావుతో కలిసి ఆలయ మండపాలు, అమ్మవారి సన్నిధి, ఆంజనేయ స్వామి ఆలయాలను పరిశీలించారు. రానున్న పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు ముమ్మరం చేసినట్లు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.