భద్రాచలం: ముత్తంగి అలంకరణలో రామయ్య
By deshaboina 1చూసినవారుభద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతి సోమవారం దాతలు సమర్పించిన ముత్తంగి కవచాలతో స్వామిని అలంకరించడం ఆనవాయితీ. తెల్లవారుజామున సుప్రభాతసేవ, సేవాకాలం, ఆరాధన వంటి పూజలు నిర్వహించిన అనంతరం, బేడా మండపంలో స్వామికి అర్చకులు నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు.