శ్రీ సీతారాముల కల్యాణం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. శనివారం పట్టాభిషేక వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఉదయం 10 గంటలకు లక్ష్మణ సమేత సీతారాముల ఉత్సవ మూర్తులను పల్లకీలో మిథిలా స్టేడియంలోని మండపానికి తీసుకొచ్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరపనున్నారు.