భద్రాచలం రామయ్య సన్నిధిలో బుధవారం రాములోరి నిత్య కల్యాణ వేడుక కనులపండుగగా జరిగింది. తెల్లవారుజామున సుప్రభాత సేవ, అభిషేకం అనంతరం బేడా మండపంలో ఉత్సవ మూర్తులకు అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువును నిర్వహించారు. ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.