చర్ల: ఉరి వేసుకుని పోస్టుమాస్టర్ మృతి

చర్ల మండలంలో పోస్టుమాస్టర్గా పనిచేస్తున్న గోసు. ఉదయ్ కిరణ్ మంగళవారం సత్యనారాయణపురం గ్రామంలోని అద్దె ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందారు. సమాచారం అందుకున్న ఎస్సై. నర్సిరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
