అధికారాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలను మంటగలుపుతోందని బీఆర్ఎస్ పార్టీ దుమ్ముగూడెం మండల కన్వీనర్ కణితి రాముడు ఆరోపించారు. ఆదివారం మణుగూరులోని పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేసి నిప్పంటించడం హేయమైన చర్య అని ఆయన ఖండించారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ శ్రేణులు మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేశాయి.