దుమ్ముగూడెం మండలంలోని కొత్తపల్లి పీఎంశ్రీ ఆశ్రమ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి ఎం. యశ్వంత్ సాయి రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికయ్యాడు. సస్టైనబుల్ అగ్రికల్చర్ విభాగంలో యశ్వంత్ సాయి ద్వితీయ స్థానంలో గెలుపొందాడు. ఈ మేరకు సోమవారం పాఠశాలలో జరిగిన సమావేశంలో విద్యార్థిని ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు.