భద్రాచలం వద్ద గోదావరి వరద మళ్లీ నిదానంగా పెరుగుతోంది. మొంథా తుపాన్ ప్రభావంతో ఎగువ ప్రాంతంలోని వాగులు పొంగిపొర్లుతు వరద నీరు గోదావరిలో కలుస్తోంది. జలాశయాల నుంచి దిగువకు వరదను వదలటంతో నీటిమట్టం పెరుగుతుందని భావిస్తున్నారు. రెండు రోజుల క్రితం 16 అడుగుల మేర ఉన్న వరద శుక్రవారం రాత్రి 18.7 అడుగులకు చేరింది. శనివారం సాయంత్రం వరకు మరిన్ని అడుగుల వరద పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.