ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో బుధవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. అన్నారం - మడికల్ అడవుల ప్రాంతంలో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్తో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మావోయిస్టుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఘటనా స్థలం నుంచి పోలీసులు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.