కొత్తగూడెం జిల్లా, పాత కొత్తగూడెం 11వ డివిజన్లో శుక్రవారం మే డే సందర్భంగా కార్పొరేటర్ ఆకాంక్ష పడాల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆమె జెండా ఆవిష్కరణ చేసి, కార్మికులు తమ హక్కుల కోసం పోరాడి సాధించుకున్న రోజే మే డే అని, శ్రమజీవులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిమ్మల గడ్డ వెంకటేశ్వర్లు, పడాల భవాని ప్రసాద్, నాగరాజు, సీపీఐ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.