తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగూడెంలో డా.మహ్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ప్రారంభించారు. ఈ సందర్భంగా, థర్మల్ పవర్ ప్లాంట్లో తెలంగాణేతరులను నియమించడంపై పాల్వంచలో ఉద్యమం రాజుకున్నట్లు తెలిపారు. ప్రజాపాలనలో భాగంగా ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తున్నామని, నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్సారెస్పీ ప్రాజెక్టులను పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించారని సీఎం పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కంచుకోట అని కూడా ఆయన అన్నారు.