జిల్లాలోని పాల్వంచలో ఏర్పాటు చేసిన మన్మోహన్ సింగ్ ఎర్త్సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మంగళవారం వస్తున్నారు. ఈ సందర్భంగా అన్ని ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి. సభాస్థలాన్ని జిల్లా యంత్రాంగం సందర్శించింది. ప్రారంభోత్సవం అనంతరం సీఎం యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగే సమావేశంలో పాల్గొంటారు. సభ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.