భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్న జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భద్రాచలం రామాలయ ఈవో రమాదేవిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. పురుషోత్తపట్నంలో ఉన్న భద్రాచలం ఆలయ భూములను చూడటానికి వెళ్లిన తెలంగాణ బీసీ ఆడబిడ్డ, ఈవో రమాదేవిపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. భద్రాచల రాముడు తెలంగాణ దేవుడని వ్యాఖానించారు. ఒక మహిళ ఈవోపై దాడి సిగ్గుచేటని మండిపడ్డారు.