కొత్తగూడెం పట్టణంలో ఆదివారం జరిగిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్ఐ రమేశ్ పాల్గొన్నారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించి సురక్షితంగా ఇళ్లకు చేరాలని ఆయన సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా ధ్రువపత్రాలు కలిగి ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు. నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు గౌరవించాలని ఆయన కోరారు.