రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, ఆదివారం నాడు జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఐడిఓసి కలెక్టరేట్ కార్యాలయంలో వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొని, అహింసా మార్గంలో ధర్మాన్ని రక్షించిన శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ప్రశంసించారు.