మొంథా తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలతో సుజాతనగర్, జూలూరుపాడు, చండ్రుగొండ మండలాల్లో వేలాది ఎకరాల్లోని పత్తి, వరి, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా పత్తి పంట ఎండిపోయి, తడిసి రాలిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరి, కూరగాయల పంటలు కూడా తుఫాను ధాటికి దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.