కొత్తగూడెం: ఈవీఎంల గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

4చూసినవారు
కొత్తగూడెం: ఈవీఎంల గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం ఆర్‌డీఓ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎంల గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం తనిఖీ చేశారు. త్రైమాసిక తనిఖీల్లో భాగంగా నిర్వహించిన ఈ తనిఖీలో గోడౌన్ భద్రతా ఏర్పాట్లు, ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రతా పరిస్థితులను పరిశీలించారు. ముందుగా గోడౌన్ సీల్‌ను పరిశీలించిన కలెక్టర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారుల సమక్షంలో సీల్‌ను తెరిపించి గోడౌన్‌లోకి ప్రవేశించారు. ఈవీఎంల భద్రతపై ఆయన ఆరా తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్