రాష్ట్రంలో చేపల ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు మంత్రి వాకాటి శ్రీహరి అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా, సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ ప్రత్యేక కార్యదర్శి సవ్యసాచి ఘోష్, డైరెక్టర్ నిఖిల్తో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, మత్స్యశాఖ జిల్లా అధికారులు పాల్గొన్నారు.