కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన లిఖితపూర్వక ఫిర్యాదులను సమర్పించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం ప్రజల సమస్యల పరిష్కారానికి ఉద్దేశించబడింది.