కొత్తగూడెం రామవరం నాగయ్య గడ్డ ప్రాంతంలోని ప్రభుత్వ యూపీఎస్ పాఠశాలలో నెలకొన్న ఉపాధ్యాయుల కొరతను వెంటనే తీర్చాలని తెలంగాణ ఉద్యమకారుడు బత్తిని రాజశేఖర్, యువజన కాంగ్రెస్ పట్టణ ఉపాధ్యక్షుడు శివశంకర్ బుధవారం ఎంఈఓకు వినతిపత్రం అందజేశారు. 90 మందికి పైగా విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.