జనగణన ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెల్ఫ్ ఏనుమరేషన్ విధానాన్ని ప్రజలు విస్తృతంగా వినియోగించుకోవాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంపై శనివారం ఐడీఓసి కార్యాలయంలో సమావేశం జరిగింది. ఇంటింటికీ వచ్చే గణన అధికారుల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా, ప్రజలు తమకు అనుకూలమైన సమయంలో ఆన్లైన్ ద్వారా వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు.