పెట్రోల్, డీజిల్ బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మంగళవారం హెచ్చరించారు. కొందరు అధిక ధరలకు విక్రయించాలనే దురుద్దేశ్యంతో కృత్రిమ కొరతను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సంయమనం పాటించాలని ఆయన కోరారు.