స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుండి లోకేష్ కుమార్, ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఈ. ఆర్. ఓలతో ఆయన ఈ సమీక్ష నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు వంటి అంశాలపై పురోగతిని సమీక్షించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.