పాల్వంచలోని అన్నపూర్ణా సమేత కాశీవిశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో శనివారం ప్రతిష్ఠాపన ప్రథమ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో గణపతి పూజ, పుణ్యాహవాచనం, ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం వంటి విశేష క్రతువులను వేద పండితులు నిర్వహించారు. ఈ వార్షికోత్సవం సందర్భంగా ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.