
100 ఏళ్ల వృద్ధుడికి హైకోర్టులో ఊరట.. హత్య కేసులో నిర్దోషిగా ప్రకటన
అలహాబాద్ హైకోర్టు దాదాపు 100 ఏళ్ల ధామి రామ్ను హత్య కేసులో నిర్దోషిగా ప్రకటించింది. 1982 నాటి భూ వివాద హత్య కేసులో 1984లో జీవిత ఖైదు పడిన రామ్, నాలుగు దశాబ్దాల తర్వాత విడుదలయ్యాడు. అతని వయస్సు, సుదీర్ఘ జాప్యం, సామాజిక పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ప్రాసిక్యూషన్ ఆరోపణలను నిరూపించడంలో విఫలమైందని పేర్కొంది. రామ్ బెయిల్ రద్దు చేయాలని ఆదేశించింది.




