ఆళ్లపల్లి మండలంలో సోమవారం అక్రమంగా నిల్వ ఉంచిన ఆరు టేకు దుంగలను ఫారెస్ట్ రేంజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జీసీసీ వెనుక అక్రమంగా నిల్వ ఉంచినట్లు అందిన సమాచారంతో అధికారులు తనిఖీలు నిర్వహించి, కలపను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న దుంగలను చింతోళ్లగుంపులోని ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.