బూర్గంపాడ్: ఎమ్పి బంజర చెక్‌పోస్ట్‌లో విధుల్లో నిర్లక్ష్యం

0చూసినవారు
బూర్గంపాడు మొరంపల్లి బంజర ఫారెస్ట్ చెక్‌పోస్ట్‌లో విధులు నిర్వర్తించాల్సిన సిబ్బంది డ్యూటీ సమయంలోనే నిద్రలో మునిగిపోయిన ఘటన శనివారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అటవీ సంపద పరిరక్షణ, అక్రమ రవాణా నియంత్రణ వంటి కీలక బాధ్యతలు నిర్వహించాల్సిన సిబ్బంది అప్రమత్తంగా ఉండాల్సిన సమయంలో నిద్రపోతున్న దృశ్యాలు విమర్శలకు తావిస్తున్నాయి. ఈ ఘటన అటవీ సంరక్షణలో నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్