మణుగూరు మండల కేంద్రంలోని తెలంగాణ భవన కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు దాడి చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈ కార్యాలయంలోని ఫర్నిచర్ను బయట పడేసి తగలబెట్టారు. ఈ ఘటనతో భారీగా మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.