బతుకమ్మ పూల కోసం చెరువుల్లోకి దిగవద్దు: అశ్వాపురం సిఐ

1886చూసినవారు
బతుకమ్మ పూల కోసం చెరువుల్లోకి దిగవద్దు: అశ్వాపురం సిఐ
బతుకమ్మ పండుగ సందర్భంగా పూల కోసం చెరువులు, నీటి గుంతలలోకి దిగి ప్రాణాలను ప్రమాదంలో పడేసుకోవద్దని అశ్వాపురం సిఐ అశోక్ రెడ్డి ఆదివారం ప్రజలకు సూచించారు. గత సంవత్సరం పూల కోసం చెరువులోకి దిగి కొందరు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు జరిగాయని, అలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని ఆయన హెచ్చరించారు. పిల్లలను పూల కోసం చెరువుల వైపు పంపవద్దని, బతుకమ్మ చెరువులో నిమజ్జనం చేసే సమయంలోనూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.