మణుగూరు మండలం సింగారం విద్యుత్ ఫీడర్లో అత్యవసర మరమ్మతుల కారణంగా శుక్రవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు. మణుగూరు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం పరిధిలోని మిగతా వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.