పినపాక మండలం సీతారాంపురం గ్రామపంచాయతీ సీతారాంపురం గ్రామంలో ఈనెల 12న జరగనున్న దుర్గమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయంను, స్థానిక సర్పంచ్ అనిత, ఆలయ వ్యవస్థాపక అర్చకులు పెద్దా చార్యులు మంగళవారం ఆహ్వానించారు. ఎమ్మెల్యే పాయంను మర్యాదపూర్వకంగా కలసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.