పినపాక మండలం బయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల సందర్భంగా గ్రౌండ్ పనులను బుధవారం ఎంపీడీవో సంకీర్త్ పరిశీలించారు. క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర మంత్రులు, కలెక్టర్ హాజరవుతున్న నేపథ్యంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.