పినపాక తహసీల్దార్ శ్రీనివాస రెడ్డి శనివారం మాట్లాడుతూ, మీసేవ సేవలను మరింత పారదర్శకంగా, వేగంగా, సులభతరం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. ఆదాయ, కుల, నివాస, ఈబీసీ, ఓబీసీ ధృవీకరణల కోసం అభివృద్ధి చేసిన జీపీవో–ఎంఆర్ఐ వెరిఫికేషన్ మొబైల్ యాప్ ద్వారా అధికారులు దరఖాస్తులను ఆన్లైన్లో పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారని ఆయన వివరించారు.