ఇల్లెందు పట్టణంలోని బాలాజీనగర్లో అంగన్వాడీ టీచర్ సరస్వతి ఇంట్లో చోరీ జరిగింది. సోమవారం పాఠశాలకు వెళ్ళిన ఆమె తిరిగి వచ్చేసరికి, ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలోని 35 గ్రాముల బంగారం, 300 గ్రాముల వెండి వస్తువులను దొంగలు అపహరించుకుపోయారు. ఈ ఘటనపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.