కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున KSRTC బస్సు డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. రాయచూరు నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు చల్లకెరె తాలూకాలోని హెగ్గరె సమీపంలో అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చల్లకెరె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగలేదు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.