TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం రాజన్న సిరిసిల్ల పట్టణంలో పర్యటిస్తునారు. ఈ సందర్భంగా సుందరయ్య నగర్ లోని ఎస్సీ బాలుర హాస్టల్ ను ఆయన సందర్శించారు. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా అక్కడి విద్యార్థులతో కలిసి కేటీఆర్ కేక్ కట్ చేశారు. కాసేపు విద్యార్థులతో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆయన బ్యాగులు పంపిణీ చేశారు.