దేశంలోనే అతిపెద్ద కూడంకుళం అణు విద్యుత్ కేంద్రానికి సంబంధించిన కీలక సమాచారం డార్క్ వెబ్లో ప్రత్యక్షమైంది. 'వరల్డ్ లీక్స్' అనే ర్యాన్సమ్వేర్ గ్రూప్, ప్లాంట్కు సంబంధించిన బ్లూప్రింట్లు, సరఫరాదారుల వివరాలు, సాంకేతిక పత్రాలు తమ వద్ద ఉన్నాయని ప్రకటించింది. ఈ సమాచారం అనిల్ అంబానీకి చెందిన
రిలయన్స్ గ్రూప్ నుంచి లభించిందని కూడా పేర్కొంది. దీనిపై స్పందించిన
రిలయన్స్, తమ డేటా థర్డ్ పార్టీ డేటా సెంటర్ సర్వర్లో కొంత మేర లీక్ కావడం నిజమేనని అంగీకరించింది.