తెలంగాణలో భూముల మార్కెట్ విలువలను పెంచే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ప్రజలపై ఒకేసారి ఆర్థిక భారం పడకుండా, ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యం సూచనల మేరకు ఈ పెంపును దశలవారీగా అమలు చేయాలని యోచిస్తోంది. తొలి విడతలో సగటున 20% మేర విలువల పెంపును అమలు చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత మార్కెట్ పరిస్థితులను బట్టి 2, మూడు విడతల్లో మిగిలిన పెంపును చేపట్టాలని ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. భూముల విలువలపై అధ్యయనం చేసిన అరవింద్ సుబ్రహ్మణ్యం బృందం మే 10 తర్వాత తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది.