AP:శ్రీశైలం ఘాట్ రోడ్డులో మంగళవారం భక్తులకు పెను ప్రమాదం తప్పింది. వర్షం కారణంగా ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. అయితే, ఆ సమయంలో భక్తులు ఎవరూ ఆ ప్రాంతంలో రాకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే రోడ్డును పునరుద్ధరించే చర్యలు చేపట్టారు.