భారత మార్కెట్లోకి లావా సంస్థ నుంచి మరో కొత్త 5G స్మార్ట్ఫోన్ 'లావా ప్లే మ్యాక్స్ 5G' త్వరలో విడుదల కానుంది. డిసెంబర్ నెలలో ఇది అందుబాటులోకి వస్తుందని అంచనా. ఈ ఫోన్ బడ్జెట్ ధరలో లభించే అవకాశం ఉంది. 7000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, స్నాప్డ్రాగన్ చిప్తో వస్తుందని సమాచారం. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS తో పనిచేస్తుంది. వెనుక వైపు EIS సపోర్టుతో 50MP AI కెమెరా, మరో సెకండరీ కెమెరా ఉంటాయి. బ్లాక్, వైట్ కలర్లలో లభించే అవకాశం ఉంది.