బెంగళూరులోని కోడిహళ్లిలో తాజాగా దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ విఫలమవడంతో యువతిపై ప్రియుడి సోదరుడు కత్తితో దాడి చేశాడు. బ్రేక్అప్ చెప్పిందనే కక్షతో సూర్య అనే యువకుడు అమృత అనే లా విద్యార్థినిపై దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అమృత మూడు రోజుల పాటు చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు సూర్య కోసం గాలిస్తున్నారు.