AP: బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గడియార స్తంభం కూడలిలో వేగంగా వెళ్తున్న బైక్ లారీని ఢీకొట్టడంతో ఇద్దరు యువకుడు అక్కడికక్కడే మృచిచెందారు. గుంటూరు జిల్లా కొరిటపాడకు చెందిన షేక్ రిజ్వాన్ (21), చింతల నాని (21) సూర్యలంక బీచ్కి వెళ్లి తిరుగు ప్రయాణంలో బాపట్ల వద్ద లారీ వెనుక భాగాన్ని బైక్ ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతకు ఇద్దరూ ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు కాగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.