యూపీలోని ఘజియాబాద్లోని నగల వ్యాపారి గిరిధారి లాల్ దారుణ హత్యకు గురయ్యారు. గోవింద్పురి మెయిన్ మార్కెట్లో ఉన్న నగల దుకాణం తెరిచిన వెంటనే ఓ దుండగుడు వ్యాపారి గిరిధారి లాల్ను దారుణంగా హత్య చేశాడు. దోపిడీ, హత్యకు పాల్పడిన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. హత్యకు సంబంధించిన వీడియో సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ కావడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.