
ట్రంప్ ఆస్తులే లక్ష్యంగా.. ఇరాన్ కొత్త యుద్ధ వ్యూహం!
మిడిల్ఈస్ట్లో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ తన యుద్ధ వ్యూహాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా సైనిక శక్తిని నేరుగా ఎదుర్కోవడం కంటే అధ్యక్షుడు ట్రంప్ బలహీనతలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఇరాన్ అడుగులు వేస్తోందని సమాచారం. దుబాయ్, ఒమన్, సౌదీ అరేబియాలోని ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్లు, హోటళ్లు, నివాస సముదాయాలపై దాడులు చేస్తోందని విశ్లేషకులు వివరిస్తున్నారు.. గల్ఫ్ చమురు, గ్యాస్ కేంద్రాలను ధ్వంసం చేయడం, హార్మూజ్ జలసంధిని మూసివేయడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలను పెంచి, అమెరికా మిత్రదేశాల్లో అశాంతిని సృష్టించాలని చూస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.




