AP: అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో లారీ బీభత్సం సృష్టించింది. ఉపాధి పనులకు వెళ్తున్న ముగ్గురు మహిళలపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను కేజీహెచ్కి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.