ఢిల్లీలోని మహిపాల్పూర్ ప్రాంతంలో గురువారం ఉదయం రాడిసన్ హోటల్ సమీపంలో పెద్ద శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇది పేలుడు అని భావించి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే, అది పేలుడు కాదని, బస్సు టైర్ పేలడం వల్ల ఆ శబ్దం వచ్చిందని అధికారులు స్పష్టం చేశారు. అగ్నిమాపక శాఖకు సమాచారం అందగా, సిబ్బంది పరిశీలించి టైర్ పేలుడునే కారణమని నిర్ధారించారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.