యూపీలోని చందౌలిలో ఒక ప్రేమకథ విషాదకరంగా ముగిసింది. రాజ్ సోంకర్ అనే యువకుడు మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడని పోక్సో చట్టం కింద జైలుకు వెళ్ళాడు. ఇటీవల విడుదలైన తర్వాత, అతను తన ప్రేయసిని కలిశాడు. 'నా ఏకైక కోరిక ఏమిటంటే కలిసి జీవించి చనిపోవడమే' అని ప్రేమికుడు చెప్పాడు. దీంతో ఇద్దరూ ఇంటి నుండి పారిపోయి విషం తాగారు. మొదట బాలిక మరణించగా, తాజాగా రాజ్ సోంకర్ కూడా మరణించాడు.