బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి 48 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఈ ప్రభావంతో మంగళవారం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అలాగే తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఈ నెల 23 ఉదయం 8.30 గంటల వరకు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని IMD పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.